Thursday, May 2, 2024
- Advertisement -

లంచం తీసుకుంటుండ‌గా నేను క‌ల్లారా చూశా మంత్రి క‌పిల్ మిశ్రా

- Advertisement -
Sacked AAP MLA Kapil Mishra Says He Saw Kejriwal Take Illegal

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసిన త‌ర్వాత ఆప్ పార్టీలో విభేదాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. పార్టీకీ వ్య‌తిరేకంగా కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మంత్రి క‌పిల్ మిశ్రాపై సీఎం కేజ్రీవాల్ బ‌హిస్క‌ర వేటుతోపాటు….పార్టీ నుంచి తొల‌గించారు.

దీంతో అప్ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. కేజ్రీవాల్‌పై అసంతృప్తిగా ఉన్న అధికార ప్ర‌తినిధి కుమార్ విశ్వాస్‌కు అత్యంత స‌న్నిహితుడు క‌పిల్ మిశ్రా. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడినని, పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.నన్ను ఎవ‌రూ స‌స్పెండ్ చేయ‌లేద‌ని…పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో తాను ఒక‌డిన‌న్నారు. పార్టీలో అవినీతి ప‌రుల‌ను త‌రిమేస్తాన‌న్నారు.క‌పిల్ మిశ్రా ముందు చెప్పిన‌ట్లుగానే … ఆప్ క‌న్వీన‌ర్.. సీఎం కేజ్రీవాల్‌పై అవినీతి ప‌రుడంటూ సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. దీంతో ఆపార్టీలో ఇప్పుడు రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి.
ఢిల్లీ సీఎంగా కొనసాగిన షీలా దీక్షిత్ హయంలో కృత్రిమ వాటర్ ట్యాంకర్ల కుంభకోణం జరిగిందని, దీని విలువ రూ.400కోట్లు ఆప్ గతం నుంచే ఆరోపిస్తోంది. అయితే ఇందులో ఆప్ నేతలు కూడా ఉన్నారని కపిల్ మిశ్రా ఆరోపిస్తున్నారు. అందుకే దానిపై ఏ నిర్ణయం తీసుకోవం లేదని అంటున్నారు.
మంచి నీటి ట్యాంక‌ర్ల య‌జ‌మానుల‌నుంచి రూ.2 కోట్లు వ‌సూలు చేసిన స‌త్యేంద్ర‌జైన్ త‌క‌ల్ల‌ముందే ఆడ‌బ్బును కేజ్రీవాల్‌కు ఇచ్చార‌నీ ….దానికి నేనే సాక్ష్యంని సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు.ఎటువంటి విచార‌ణ జ‌రిగినా తాను సాక్ష్య‌మిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్నారు.ఆప్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో నేను ఒక‌డిన‌ని పార్టీని వ‌దులుకోన‌ని తెలిపారు. ఈ విష‌యంపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారోన‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌
  2. పాక్ ప్ర‌ధాని న‌వాజ్‌పై కేసు న‌మోదు….
  3. నింగిలోకి దూసుకెల్లిన‌.. సార్క్ ఉప‌గ్ర‌హం
  4. మోదీ బాబ‌ను దూరం పెడుతున్నారా…..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -