టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగా తయారయ్యింది. కొడుకు లోకేష్ను రాజకీయాల్లో తీసుకొచ్చన ఆనందం అంతలోనే అవిరయ్యింది. తండ్రి ఇమేజ్తోపాటు పార్టీ ప్రతిష్టను పెంచుతాడని పెట్టుకొన్న ఆశలన్నీ చిన్నబాబు వమ్ముచేస్తున్నారు. పరువు,ప్రతిష్టలను అటుంచితే ఉన్న పరువును కాస్త తీసేస్తున్నారు.
నారాలోకేష్ మంత్రి అవ్వగానే ఇప్పుడు టీడీకీ కొత్త చిక్కువచ్చిపడింది.
చినబాబు అనాలోచిత ప్రసంగాలతో నవ్వులపాలయిన చినబాబును విమర్శలనుంచి కాపాడేందుకు నానాతంటాలు పడుతున్నారు టీడీపీ నాయకులు. అయినా కూడా లోకేష్లో మాత్రం మార్పు రాలేదు.గతంలో టీడీపీ పాలనమీద విమర్శలు ఉండేవి కాని లోకేష్ వచ్చినతర్వాత అవన్నీ నారాలోకేష్ చుట్టూ తిరుగుతున్నాయి.ఎమ్మెల్సీగా ప్రమాన స్వీకారం చేసేటప్పుడు తప్పులు చదివి మీడియాకు అడ్డంగా బుక్ అయ్యారు. మంత్రిగా బాద్యతుల తీసుకున్న తర్వాత అయనలో మార్పు వచ్చిందనుకున్నారు.
సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో పెన్నుమరచిపోయిన లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర తీసుకున్న వైనం మీడియాకు చిక్కింది. మంత్రి పదువుల ఇవ్వడమంటే పరిపాలనలో అనుభవం ఉన్న సీనియర్లకు ఇస్తారు..కానీ పంచాయితీ రాజ్ శాఖను అడుగుతానే బాబు లోకేష్కు కట్టబెట్టారు.అంతే ఇంకేముంది లోకేస్ ప్రతిభ ఎంతో భయటపడింది. ఓబహిరంగ సభలో పంచాయితీ రాజ్ శాఖ మత్రిగా మాట్లాడతూ రెండేల్లలో తాగునీటి సమస్యను సృష్టించడమే తమ ధ్యేయమని ప్రకటించారు అంతే అందరిలో నవ్వుల పాలయ్యారు.
అంతటితో ఊరుకున్నారా మరో సారి అదే పొరబాటు చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగసభలో వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఉండేది 175 సీట్లు 200 సీట్లు ఎక్కడివని జనాలు నవ్వుకున్నారు. అన్నింటి కంటే దారునమైన విషయమేమంటే భారతరత్న అవార్డుగ్రహీత రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ జయంతని వర్ధంతిని చేసి అభాసుపాలయ్యారు. అప్పటికీ ఏమైనామారాడా అంటే లేదు. ఇంకా రెచ్చిపోయారు….. జగన్ పదిసంవత్సరాలు అధికారంలో ఉండి ఏపీకి ఎన్నికంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.చినబాబు అనిముత్యాలగురించి జాతీయ మీడియా కూడా పెద్దపెద్ద కథనాలను ప్రచురించింది. మొత్తానికి తప్పటడుగులు వేస్తున్న లోకేస్ను కాపాడుకోవడానికి టీడీపీ మంత్రులు…నేతలు కాపాడుకోలేక నానాతంటాలు పడుతున్నారు.ఇది మన చినబాబు బాషా పరిజ్ణానం.
Related