ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తీరు టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఒక నాయకుడిగా లోకేశ్ ఇమేజి పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతున్నాయి.బాబు క్లాస్ తీసుకున్నా మార్పురాలేదు.
ప్రతీసారి తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. అసందర్భమైన మాటలతో, అనాలోచిత వ్యాఖ్యలతో లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్న లోకేష్.. అడ్డంగా బుక్కవుతున్నారు. దీంతో సోషియల్ మీడియా ఏరేంజ్లో అడుకుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే మీడియా, ప్రతిపక్షపార్టీలు చినబాబును
మొన్నామధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటినీ మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి ఆయన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు.
అంతే అక్కడున్న కార్యకర్తలు టీడీపీ నాయకుల అందరూ షాక్ గురయ్యారు. అమాట అనగానే నోరు వెల్లబెట్టారు.అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు నూటికి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లు ఎక్కడి నుంచి గెలిపించుకురావాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకున్నారు. అయినా.. నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా.. దొడ్డి దారిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి సంపాదించి మంత్రి అయిన ఆయనకు.. అసెంబ్లీ గురించి ఎలా తెలుస్తుందిలే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
ప్రతీ సారి ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోతున్న బాబులో మాత్రం మార్పు రావడంలేదు. ఎవరైనా ఒకటి రెండు సార్లు తప్పులు చేయడం సహజం… కానీ ప్రతీ సారి తప్పులమీద తప్పులు చేస్తున్న లోకేష్ను చూసి పార్టీనాయకలు,తోటి మంత్రలు బెంబెలెత్తిపోతున్నారు. ఏదైనా సభలు,సమావేశాలకు ముఖ్యఅథిదిగా పిలవాలంటే హడలెత్తిపోతున్నారు. ఇలా ప్రతీ సారీ తప్పుగా మాట్లాడి పార్టీ పరువుతోపాటు బాబుకున్న ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేస్తుండటంతో బాబు గారికి ఏంచేయాలో పాలుపోవడంలేదు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీస్తానాలు ఉన్నాయోకూడా తెలవని లోకేషా కాబోయే ముఖ్యమంత్రిని జనాలు నవ్వుకుంటున్నారు.ఒక మంత్రిగా పార్టీ పరువును తండ్రి పేరును నిలబెట్టాల్సిన లోకేష్ ఇలా పరువు తీస్తుండటంతో బాబుగారు కుంగిపోతున్నారు. మరి ఇప్పటికీ కూడా లోకేష్లో మార్పు రాకుంటే ఇక టీడీపీ పని గోవిందా..
Also Read
- బాబుకి దిమ్మతిరిగేలా చేసిన 9 తరగతి అమ్మాయి
- బాబు పరిస్థితి దారుణం.. సొంత పార్టీ నేతలే తిడుతున్నారు
- చంద్రబాబుకి లెటర్ రాసి.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి
- లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..