కొన్ని విషయాలు కనిపించడానికి మాములుగా కనిపించినా.. దాని వేనక ఏదో తెలియని రహస్యం దాగి ఉంటుంది. రీసెంట్ గా వంగవీటి దర్శకనిర్మాతలపై ఆయన తనయుడు, వైసీపీ నాయకులు రాధా కేసు వేయడం పెట్టడం వెనక కూడా ఇలాంటి మర్మమే దాగి ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి వంగవీటి సినిమాపై రిలీజ్ కు ముందుగానే వర్మ ముందు అభ్యంతరాలు తెలిపింది రంగా కుటుంబం.
అయితే ఈ విషయంలో మాత్రం వర్మ వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్లాడు. వంగవీటిపై తెరకెక్కించిన మూవీలో ఏవో వివాదాలు ఉంటాయని భావించిన వారంతా… సినిమాలో ఏమీ లేదని పెదవి విరిచారు. వర్మ ఎవరి జీవితాల్లోకి లోతుగా వెళ్లకుండా సేఫ్ గేమ్ ప్లే చేస్తారని చర్చించుకున్నారు. దీనికి తోడు సినిమా కూడా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇక వంగవీటి వివాదం ముగిసినట్టే అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి.. రంగా తనయుడు రాధా మరోసారి ఈ సినిమాపై కేసు పెట్టడంతో ఆయన ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరికొందరైతే రంగా పేరు ట్రెండింగ్ లో ఉంటేనే విజయవాడలో వైసీపీ పాగా వేయగలుగుతుందనే ఉద్దేశంతో వైసీపీ అధినేత రాధాతో ఈ కేసు వేయించారనే టాక్ వినిపిస్తోంది. కారణం ఏదైనా… ముగిసిపోయిన అధ్యాయం అనుకున్న వంగవీటి సినిమా వివాదాన్ని రాధా మళ్లీ ఎందుకు బయటకు లాగుతున్నారో ఆయనకే తెలియాలి.
Related