వైఎస్ జగన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.. చాలా తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏర్పాడు చేయడం జరిగింది.
ఎప్పుడు ప్రజల సమస్యలపై.. పోరాడుతూ.. రాజకీయంగా చాలా బిజీగా ఉండే జగన్.. తాను తినే తిండి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా అశ్రద్దగా ఉండడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రతి రోజు ఒకే మెనూతో జగన్ ఆహారం తీసుకుంటాడు. ఆయన ఆహారపు అలవాటు కారణంగానే ఆరోగ్యంగా ఉంటాడేమో అనిపిస్తుంది. జగన్ ఉదయాన్నే ఒక టీ తీసుకుని.. గంట తర్వాత ఫ్రూట్ సలాడ్ ను తీసుకుంటాడు.
అలాగే రెండు ఇడ్ల్లు లేదా ఒక వడను టీఫిన్ గా తీసుకుంటాడట. ఇకా మద్యాహ్నం పులిహోర లేదా చెపాతీ తీసుకుంటాడట. పులిహోరలో ఖచ్చితంగా.. డ్రై ఫుడ్స్ ఉండేలా జగన్ చూసుకుంటాడు. సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాడట. ఇక రాత్రి సమయంలో పెరుగన్నం మరియు నాన్ వెజ్ తో రైస్ లేదా చెపాతి తింటాడట. ఇదే క్రమం తప్పకుండా తినడం వల్ల జగన్ ఎన్ని కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపినా కూడా అలసి పోకుంటా ఉంటాడు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related