నారాలోకేష్ అంటె గుర్తు పట్టని వారుంటారేమోగాని ….ముద్ద పప్పు అంటే చాలు లోకేషే గుర్తుకొస్తారు..అంత పాపులారిటీ సంపాదించపారు .ఇప్పటి సోషియల్ మీడియాలో చినబాబుపై ఎలాంటి సెటైర్లు వేశారో చెప్పాల్సిన పనిలేదు.జగన్ అభిమానులు,పార్టీ నాయలకులే ఇప్పటి వరకు లోకేష్పై పంచ్లేశారు.
ఇప్పుడు ఏకంగా అధినేత జగనే అదిరిపోయే పంచ్ విసిరారు.దీంతో చినబాబు,పెదబాబుతోపాటు టీడీపీ నాయకులకు దిమ్మ తిరిగిందనే చెప్పాలి.
గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షలో చివరి రోజు జగన్ మాట్లాడారు. మాటల్లో లోకేష్పై సూపర్బ్ పంచ్ పడింది. ఆ పంచ్ డైలాగ్ పేల్చింది ఎవరో కాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ కావడం గమనార్హం. టీడీపీ నేతలే, మంత్రి లోకేస్ని లో’క్యాష్’గా అభివర్ణిస్తున్నారంటూ జగన్ అదిరిపోయే పంచ్ విసిరారు. దీంతో ఒక్కసారిగా దీక్షా ప్రాంగణం లోకేష్కి వ్యతిరేకంగా ‘లోక్యాష్’ నినాదాలతో మార్మోగిపోయింది.
నారా లోకేష్ మంత్రి కాక ముందునుంచే ఆయనపై అవినీతి ఆరోపణలు విన్పిస్తున్నాయి. మంత్రి అయ్యాకా లోకేష్పై ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా ఇసుక కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచీ ఆరోపణలన్నీ లోకేష్ కేంద్రంగానే విన్పిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో జగన్, లోకేష్ని లో’క్యాష్’గా అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్ విసిరిన పంచ్కి టీడీపీ నుంచి కౌంటర్ ఎలాగూ వుంటుంది. అయినాసరే, ఓ పక్క ‘ఆంధ్రా పప్పు’ అంటూ టీజింగ్ షురూ చేసిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ‘లోక్యాష్’ పేరుతో టీజింగ్ షురూ చేయడం విశేషమే మరి. ఇలా జగన్ ‘లోక్యాష్’ అంటూ ఆరోపణలు మొదలుపెట్టారో లేదో, సోషల్ మీడియాలో ఇప్పుడీ లోక్యాష్ మీద కుప్పలు తెప్పలుగా కామెంట్స్ హోరెత్తుతున్నాయి. ‘ఆంధ్రా పప్పు’ కామెంట్స్ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయిన, చంద్రబాబు సర్కార్, ఇప్పుడీ ‘లోక్యాష్’ వ్యవహారంపై ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి జగన్ విసిరిన ఈ పంచ్ డైలాగ్పై టీడీపీ శ్రేనులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read