టీడీలో కామెడీ నాయకులకు కొదువలేదు. ఇప్పటికే జలీల్ఖాన్,లోకేష్,ఎస్వీ మోహన్రెడ్డి వీల్లందరూ సోషియల్ మీడియాలో ఎంతపాపులర్ అయ్యారో వేరే చెప్పనక్కరలేదు. వీల్లతో పాటు మరో కామెడీ రెడ్డిగారు కూడా ఉన్నారండోయ్.నేనేం తక్కువ అంటూ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు నెల్లూరు ఎమ్మెల్సీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిగారు. ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో నేనేం తక్కువా అంటూ మనసు విప్పి మరీ జగన్మీద బురద జల్లే కార్యక్రమంలో బట్టలు చించుకొనీ మరీ కామెడి పండించారు.
ఎదుటి వారిని విమర్శించే ముందు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించుకొని మాట్లాడలి. అవన్నీ మనకేం పట్టవు. అందులో దమ్మున్న ఛానల్లో మాట్లాడితే బాబుదగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చనుకున్నారు.5లక్షల మెజారీటీతో గెలిచి దేశంలోనే సంచలనం సృష్టించి… ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధిష్టానాన్ని దిక్కరించి విలువలతో కూడిన పార్టీనీ స్థాపించారు జగన్. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామ చేయించి మళ్లీ గెలిపిందచుకన్న నాయకుడు జగన్మోహన్రెడ్డి. కాంగ్రెస్,టీడీపీ కుట్రపన్ని కేసులు పెట్టినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్న నాయకుడిపై అవాకులు,చవాకులు పేలుతూ తెగ కామెడీ పండించారు ఈ నెల్లూరు రెడ్డిగారు. బాబు లాగా దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేయలేక ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల సమస్యలపై పోరాడుతున్న జగన్ ను పార్ట్టైమ్ పోలిటీషియన్ అంటూ తెగ కామెడీ డైలాగులు వేశారు.
ఆయన గారి చరిత్ర చూసుకుంటే జగన్ కాలిగోటికికూడా సరిపోడు. టీడీపీ తుపున పోటీచేసి ఐదు సార్లు ప్రజల చేత ఛీకొట్టించుకున్న సోమిరెడ్డి…తను మంత్రి కావడంకోసం అస్తమానం జగన్ ఆయన కుటుంబంపై విమర్శలు చేసి చినబాబు దగ్గర మార్కులు కొట్టేసి… ఆ మార్కులతో బాబు దగ్గర మంత్రిపదవి ఇప్పించుకున్న సంగతి అందరికీ తెలిసందే. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ధైర్యంలేక దొంగచాటుగా మత్రి అయిన రెడ్డిగారు …రోజురోజుకీ నోరు జారుతూ జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువుతీస్తున్న చినబాబుతో జగన్కు నో కంపేరిజిన్ అంటూ అంటు న్నాడు సోదిరెడ్డి. ఛానల్ అధినేత.. రెడ్డిగారు ఇద్దరూ బురదకామెడీ పండించేశారు. ఇంకా టీడీపీలో ఎంతమంది ఉండారో కామెడీ బాబులు. ఇదంతా చూస్తే అనగనగా ఓఊరులో బ్రహ్మానందం నెల్లూరి పెద్దారెడ్డి కామెడి గుర్తకొస్తాది.
{youtube}LvGMbIlmWy4{/youtube}
Related