Monday, May 20, 2024
- Advertisement -

జగన్ రెచ్చిపోడానికి ఇదే కరెక్ట్ టైం

- Advertisement -

కేంద్రం చేసిన అన్యాయానికి… బాబు ప్ర‌భుత్వం తీరుకు వ్య‌తిరేకంగా వైకాపా మ‌రో భారీ బ‌హిరంగ‌ స‌భ‌కు రంగం సిద్దం చేస్తోంది. ఈనెల 22న‌ ఏలూరులో భారీ ఎత్తున యువ‌భేరి మోగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన వైకాపా యువ‌భేరి పోస్ట‌ర్ ను పార్టీ కార్యాల‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు జ‌గ‌న్ సూచించారు.

రాష్ట్రంలో ఎంతో మంది పిల్ల‌లు చ‌దువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారు. పైగా ఇప్పుడు రాజ‌ధాని కూడా లేక‌పోవ‌డంతో ఉద్యోగాలు రావ‌డం మ‌రింత క‌ష్ట‌మ‌వుతోంది. బాబు వ‌స్తే జాబ్ వ‌స్తుంద‌ని భావించిన వారంద‌ర్నీ ఆయ‌న మోసం చేశారు. దీంతో యువ‌త భ‌విష్య‌త్తు ఆగ‌మ్య గోచ‌రంగా మారింది.

ఇలాంటి టిఫిక‌ల్ అంశాల‌పై జ‌గ‌న్ యువ‌భేరి స‌భ‌లో ప్ర‌ధానంగా ప్ర‌స‌గించ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే స‌భ‌లో ప్ర‌త్యేక హోదా అంశంపై యువ‌త‌లో చైత‌న్యం తీసుకొచ్చే విధంగా జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువ‌తరం ఎజెండాపైనే ఈ భేటి జర‌గ‌నుంద‌ని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -