Saturday, April 27, 2024
- Advertisement -

హీరో అర్జున్ కూతురుకి కరోనా.. ఇప్పుడెలా ఉంది ?

- Advertisement -

ప్రముఖ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ కు కరోనా సోకింది. ఆమెకు ఇటీవలే నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈమేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. “ఇటీవలే నాకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్ల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను” అని ఐశ్వర్య చెప్పింది.

ఇక తనను గత కొద్ది రోజులుగా కలిసిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలో తెలుపుతానని ఆమె వెల్లడించారు. ఇక ప్రస్తుతం కర్ణాటకలో కరోనా విజృభిస్తోంది. కన్నడ పరిశ్రమలో చాలా మందికి కరోనా సోకింది. అర్జున్ మేనల్లుడు, దివంగత నటుడు చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యకు పాజిటివ్ అని తేలింది.

ఇక అర్జున్ కు ఇద్దరు కుమార్తెలు. ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే హీరోయిన్ గా పరిచయం అయింది. విశాల్ హీరోగా తమిళ్ లో వచ్చిన ’పట్టాతు యానై’ సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఈ మూవీ తెలుగులో ’ధీరుడు’ పేరుతో విడుదలైంది. ఆ తర్వాత ’ప్రేమ బరహ’ మూవీతో కన్నడ ప్రేక్షకులకు పరిచమైంది. ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో నటించినా ఐశ్వర్య అర్జున్ కు బ్రేక్ రాలేదు. ఇప్పుడు తెలుగులో పరిచయం అయ్యేందుకు చూస్తోంది. మరి తెలుగులో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -