Saturday, April 27, 2024
- Advertisement -

నిర్మాత ఓకే కానీ దర్శకుడు నాట్ ఓకే

- Advertisement -

వరుస ప్లాపులతో సతమతమైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు ‘చిత్రాలహరి’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా సాయి ధరం తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ‘ప్రతిరోజు పండగే’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. కానీ దర్శకుడి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదట.

నిర్మాతలు జె. భగవాన్ మరియు పుల్లారావు మెగా మేనల్లుడు కి పెద్ద మొత్తాన్ని ఇచ్చారు. కానీ సాయిధరమ్తేజ్ మాత్రం ఇంకా ఏ కథకు ఓకే అనడం లేదు. ముందు గోపిచంద్ మలినేని రాసిన ఒక స్క్రిప్ట్ ని సాయిధరమ్ తేజ్ ఒప్పుకున్నాడు కానీ తర్వాత మళ్లీ వద్దని అన్నాడు. నిర్మాతలు అయితే ఈ సినిమాకి కుదిరారు కానీ దర్శకుడి కోసం ఎప్పటినుంచో వెతుకులాట జరుగుతోంది. సాయి ధరంతేజ్ కి నచ్చే కథతో ఏ దర్శకుడు ఇంకా రాలేదని తెలుస్తోంది. దాదాపు స్టార్ దర్శకులందరూ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ సమయంలో లో ఈ మెగా హీరో వద్దకు ఏ దర్శకుడు కథ తో వస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -