Saturday, April 27, 2024
- Advertisement -

ఆ డైరెక్టర్ తో ఛార్మి ఇలా చేసిదేంటి ?

- Advertisement -

సోషల్ మీడియాలో ఛార్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ సీనియర్ దర్శకుడితో ప్రైవేట్ పార్టీలో ఛార్మి ఎంజాయ్ చేసింది. ఇంతకీ ఎవరా సీనియర్ దర్శకుడు? విషయంలోకి వెళ్తే.. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన ‘నీ తోడు కావాలి’ సినిమాతో ఛార్మి కౌర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో కలిపి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది.

ఇక పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన ఛార్మి.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలతో పాటుగా ఈ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల నిర్మాణ బాధ్యతలను భుజాలపై వేసుకుంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి మంచి హుషారులో ఉన్నారు పూరి- ఛార్మి. తాజాగా సీనియర్ దర్శకుడు జయంత్ సి. పరాన్జీతో కలిసి పెద్ద పార్టీ చేసుకుంది ఛార్మి. ఆయనతో అలా అలా పార్టీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి.. తమ స్నేహానికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పార్టీ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘అల్లరి పిడుగు’ సినిమాలో తొలిసారి జయంత్ సి. పరాన్జీతో కలిసి పనిచేసింది ఛార్మి. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. మొత్తానికి ఇలా ఛార్మి ఎంజాయ్ చూసి.. ”ఎంతైనా ఛార్మి అంటే ఛార్మినే, ఎంజాయింగ్ బ్యూటీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక జయంత్ సి. పరాన్జీ విషయానికొస్తే.. ”ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మీ నరసింహ, తీన్ మార్” లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -