ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఆ ఎంపీ స్థానం..ఇప్పుడు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. 2014,2019లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి విజయం సాధించారు.ఇక ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
రాజంపేట లోక్ సభ సీటు పరిధిలోకి రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఇందులో పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోట.అలాగే రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి తంబళ్లపల్లెను కంచుకోటగా మార్చుకున్నారు. మొత్తంగా రాజంపేట పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ని ఎవరు నిలబడ్డ గెలిచే విధంగా మారిపోయిందనే చెప్పుకోవాలి.
ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోకి వచ్చే రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈసారి మిథున్ రెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉండగా గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన పీలేరు ఉంది. ఈ ఒక్క చోట తప్ప మిగితా నియోజకవర్గాల్లో వైసీపీదే విజయం. అందుకే రాజంపేటలో ఈసారి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే టాక్ నడేస్తోంది.