Friday, April 26, 2024
- Advertisement -

యష్ కంట్లో మొదటిసారి కన్నీళ్లు చూసిన రాధిక

- Advertisement -

‘కేజిఎఫ్’ సినిమా తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం అదే సినిమా సీక్వెల్ అయిన ‘కే జి ఎఫ్ చాప్టర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కన్నడ లో పాపులర్ స్టార్ కపుల్స్ లో యష్ మరియు అతని భార్య రాధిక పండిట్ ఒకరు. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ప్రేమించి 2016 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ‘ఇరా’ అనే ఒక పాప కూడా జన్మించింది. తాజాగా రాధిక పండిట్ తన భర్త గురించి మాట్లాడుతూ మొదటిసారిగా తన భర్త కంట్లో కన్నీళ్లు చూశానని చెప్పుకొచ్చింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం ఎప్పుడూ సమయాన్ని కేటాయిస్తాడు యష్. ఈమధ్యనే ఐరాకు చెవి పోగులు కుట్టించారట. ఆ సమయంలో నొప్పితో ఐరా ఏడుస్తుంటే తల్లిదండ్రులుగా తాము కూడా అల్లాడిపోయామని రాధిక చెప్పింది. అప్పుడు యష్ కన్నీరు పెట్టుకున్నాడట. అప్పుడే బంధాల విలువ మరోసారి తెలిసిందని ఆమె అన్నారు. అంతేకాకుండా అభిమానులని ఉద్దేశిస్తూ “మీరేం బాధపడకండి తండ్రి కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు” అంటూ ఐరా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాధిక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -