Saturday, April 27, 2024
- Advertisement -

ఫారిన్ లో స్టోరీ సిట్టింగ్ లో నిమగ్నమైన పూరి

- Advertisement -

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ మధ్యనే రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మళ్లీ పూరి మార్క్ డైరెక్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా పై కూడా దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. తను రాసుకున్న ‘జనగణమన’ కథను ఇప్పుడు సినిమా తీయాలని హీరో కోసం వేట మొదలు పెట్టాడు పూరి.

అయితే గతకొంతకాలంగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి ఈ సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ పూరి జగన్నాద్ అసలు విజయ్ దేవరకొండ ని ఇంకా కలవలేదట. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘కే జి ఎఫ్’ స్టార్ యష్ కి ఈ కథ చెప్పబోతున్నాడు అని తెలుస్తోంది. ‘కే జి ఎఫ్ చాప్టర్ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న యష్ ఫారిన్ లో ఉన్నాడు. ‘జనగణమన’ కథ పూర్తయిపోవడంతో పూరి జగన్నాథ్ స్వయంగా కథ నెరేట్ చేయడం కోసం ఫారిన్ వెళ్ళానున్నట్లు తెలుస్తోంది. మరి ‘కేజీఎఫ్’ స్టార్ ‘పోకిరి’ డైరెక్టర్ కి ఎస్ చెప్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -