పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇబ్బందుల్లో పడింది.బద్రిసినిమాలో పవన్ సరసన రేణు దేశాయ్ తో పాటు అమీషా పటేల్ కూడా హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో… ఈ అమ్మడు తరువాత అనేక సినిమాల్లో నటించింది. బద్రి మినహా మరో సినిమా హిట్ కాలేదు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఫోటోషూట్లతో కాలం గడుపుతోంది. ఇప్పుడు ఈ భామకి కోర్టు కేసు మెడకు చుట్టుకుంది.
బాలీవుడ్ లో మంచి ఆఫర్లు తెచ్చుకొని కెరీర్ చక్కగా సాగుతున్న సమయంలో నిర్మాతగా మారి సినిమా తీయాలని అనుకుంది. ఓ సినిమా కథ నచ్చడంతో తనే నిర్మాతగా మారి సినిమా తీయడానికి సిద్ధమైంది అమీషా.. దీనికోసం అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర మూడు కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఫైనాన్షియర్ ఒత్తిడి చేయడంతో అతడికి చెల్లని చెక్కు ఇచ్చింది అమీషా.. దీంతో సదరు ఫైనాన్షియర్ ఆమెపై కేసు వేశాడు.
రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈ నెల 8న ఆమె కోర్టుకి హాజరు కావాలి.. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించింది. తనకు రావాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని.. ఇప్పుడు చెల్లించకపోతే ఎప్పటిలోపు చెల్లిస్తారో బాండ్ రాసి ఇవ్వాలని అజయ్ కుమార్ సింగ్ అంటున్నారు.