Saturday, April 27, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి త‌న మాట‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయ‌త్నం జ‌రిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో జ‌గ‌న్ భూజానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి. దీని గురించి ఆంధ్రప్ర‌దేశ్‌లో పెద్ద చ‌ర్చే న‌డుస్తున్న త‌రుణంలో శ్రీరెడ్డి వాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.దీనిపై శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో మాట్లాడుతు…”మా జగన్ అన్నకి ఏం అయ్యింది, రాష్ట్రం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి, దమ్ముంటే దైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని జనం కోసం పోరాడుతున్న జగన్ గారి మీద ఇలా చేయటం తప్పు.

త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా జగన్ అన్నా” అంటూ ఆమె ఓ పోస్ట్ పెట్టారు.దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. . దానికి కారణం శ్రీరెడ్డి తన పోస్ట్ లో ప్రతి పక్షాల దాడి అని చెప్పడమే.. కొందరు నెటిజన్లు ప్రతిపక్షాల దాడి ఏంటి..? జగన్ ప్రతిపక్షమే కదా.. అంటూ సెటైర్లు వేస్తుండగా.. మరికొందరు ఆమెని తిట్టిపోస్తున్నారు. అధికార ప‌క్షానికి ,ప్ర‌తిప‌క్షానికి తేడా తెలియ‌ని నువ్వు కూడా జ‌గ‌న్ గురించి మాట్లాతున్నావా అంటూ శ్రీరెడ్డిపై మండిప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -