Saturday, April 27, 2024
- Advertisement -

ఇక ఆడవాళ్లు పొట్టిబట్టలేసుకుంటే భారీ జరిమానా..?

- Advertisement -

యువతులు..మహిళలు పొట్టి పొట్టి బట్టలు వేసుకోకూడదనీ..అలా వేసుకునేవారికి జరిమానా విధించేందుకు కంబోడియా ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి ఓ చట్టం ముసాయిదా సిద్ధం చేస్తోంది.దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఇది మహిళ స్వేచ్ఛపై విధించే ఆంక్షలని మండిపడుతున్నారు. విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలామంది మహిళలు నిరసనలు తెలుపుతున్నారు.

అంతేకాదు మోలికా అనే 18 ఏళ్ల యువతి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ మొదలుపెట్టారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను, సభ్యతను పరిరక్షించేందుకు ఈ చట్టాన్ని తెస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. దీనిపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఈ చట్టం ఆమోదం పొందితే.. కంబోడియాలో శరీరం ఎక్కువగా కనిపించేలా మహిళలు ‘పొట్టి’ బట్టలు వేసుకోవడంపై నిషేధం అమలవుతుంది. అటు, పురుషులు కూడా అర్ధనగ్నంగా గానీ..ఛాతీపై దుస్తులు లేకుండా తిరగకూడదు. ప్రభుత్వ తీరుపై ఆడాళ్లు ఆన్‌లైన్‌లో పిటిషన్ మొదలుపెట్టారు. సౌకర్యంగా అనిపించే దుస్తులను వేసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని యువతులు..మహిళలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -