మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారు . బుద్దిగా కాపురం చేయకుండా మూడో మహిళను పెళ్లిచేసుకొనేందుకు రెండో భార్యకు నరకం చూపించాడు. ఆమె తప్పించుకుని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెల్తే….రైల్వేకోడూరు పట్టణంలోని పాతబజారుకు చెందిన యాదాల ప్రసాద్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి 1999లో నెల్లూరు జిల్లా గూడురుకి చెందిన సుధ అనే మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లకు ఆమెను వదిలేసి 2013లో చిత్తూరు జిల్లా కందూరుకు చెందిన ప్రణీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
గత కొంత కాలంగా తాను మరొక మహిళను వివాహం చేసుకుంటానని చెబుతూ ప్రతి రోజూ రాత్రి సమయంలో చిత్రహింసలు పెడుతున్నా ఆమె భరిస్తూ వచ్చింది. ఇటీవల తాను మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు భార్యకి చెప్పి.. ఆమె గొంతుకు చున్నీ వేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.
అతని భారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.