Saturday, April 27, 2024
- Advertisement -

ఏపీలో వైసీపీకీ మ‌ద్ద‌తుపై స్పందించిన కేటీఆర్‌…

- Advertisement -

తెలంగాణా ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్ర‌మాణ స్వీకారాణానికి అంతా రంగం సిద్ధం అయ్యింది. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఏపీసీఎం చంద్ర‌బాబు జోక్యం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తెలంగాణా ఎన్నిక‌ల్లో బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో కూడా జోక్యం చేసుకుంటామ‌ని కేసీఆర్‌, కేటీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

వ‌చ్చే సంత్స‌రం రాష్ట్రంలో వైసీపీకీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే విష‌యంలో కేటీఆర్ స్పందించారు. మ‌ద్ద‌తు ఇవ్వాల వ‌ద్దా అనేది ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపారు. ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ లు చేసిన పలు వ్యాఖ్యలు, ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రవేశంపై ఊహాగానాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

టీఆర్ఎస్ ఇంతవరకూ ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీకీ దగ్గర కాలేదని చెప్పిన కేటీఆర్, అనేక పార్టీలతో తాము స్నేహంగా ఉంటున్నామని చెప్పారు. ఏపీలో జగన్ చాలా గట్టి పోటీని ఇస్తున్నామని, ఆయనకు మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం, పాలనపై దృష్టిని సారించామని త‌ర్వాత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఏపీ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -