Saturday, May 4, 2024
- Advertisement -

పవన్‌కు షాక్‌ల మీద షాక్‌లు!

- Advertisement -

జనసేన అధినేత పవన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీ రావు, పోలసపల్లి సరోజ, పంతం ఇందిరతో పాటు ముఖ్యనేతలు పార్టీని వీడగా తాజాగా అమలాపురం జనసనే సీనియర్ నేత డీఎంఆర్ శేఖర్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు శేఖర్. మూడోస్థానంలో నిలిచినా 2 లక్షల 54 వేల ఓట్లు సాధించారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమలాపురం లోక్‌సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తానని డీఎంఆర్ శేఖర్ ప్రకటించారు. జిల్లాలో జనసేనను బలోపేతం చేయడానికి తాను ఎంతో శ్రమించానని తెలిపారు. పవన్‌ని నమ్ముకుని ఆర్ధికంగా నష్టపోయానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -