Saturday, April 27, 2024
- Advertisement -

చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య కేసులో వెలుగు చూస్తున్న కొత్త నిజాలు..

- Advertisement -

కోస్ట‌ల్ బ్యాంక్ ఛైర్మెన్ చిగురుపాటి జ‌య‌రాం కేసులో కొత్త విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. జయరామ్‌ మేనకోడలు షికా చౌదరి, ఆమె ప్రియుడు రాకేష్‌లు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శిఖా చౌద‌రిని అదుపులోకి తీసుకున్న పోలీస‌లు ర‌హ‌స్య‌ప్ర‌దేశంలో విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జయరాం హత్య జరిగిన తర్వాత నుంచి శిఖా చౌదరి కనిపించకుండా పోయారు. కాగా.. ఎట్టకేలకు ఆమె ఆచూకీని పోలీసులు కనుక్కోగలిగారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. షికా చౌదరి, రాకేష్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, వీరి వివాహానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. తన మేనకోడలును వదిలేయమని రాకేష్‌ను జయరామ్‌ కోరారని, వదిలేయడానికి రూ.3.5కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒప్పందం ప్ర‌కారం జయరామ్‌ డబ్బులు ఇవ్వలేద‌ని… దీంతో మళ్లీ ఒక్కటైన షికా, రాకేష్‌లు జయరామ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన రోజు జయరామ్‌ ఇంటికి షికా వచ్చినట్లుగా తెలుస్తోంది. వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో వాచ్ మెన్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -