- Advertisement -
టీవీ9 మాజీ సీఈవో ఎట్టకేలకు అజ్ణాతం వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చాడు. ముంస్తు బేయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగి చివరకు అన్ని చోట్లా చుక్కెదురవడంతో చేసేది లేక సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ముందస్తు బేయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్కు షాక్ తగిలింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం నాడు సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశించింది. జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రవిప్రకాశ్ ను అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని కూడా తెలంగాణ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించించిన సంగతి తెలిసిందే.