Saturday, April 27, 2024
- Advertisement -

అధికారం కోసం బాబు పేజీలకు పేజీలు మేనిఫెస్టో రచిస్తున్నారట..?

- Advertisement -

అధికారం కోసం ఏ రాజకీయ నాయకుడైన అది తెస్తాను ఇది తెస్తాను అని ప్రజలకు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ ఈ విషయంలో చంద్రబాబు ఒక ఆకు ఎక్కువ చదివారు.. తాను అధికారంలోకి రావడానికి దేశంలో ఏ సీఎం చెప్పని విషయాలు , పథకాలు తెస్తానని ప్రజలను నమ్మించేవాడు.. అయితే ప్రజలు ఆయన్ని నమ్మలేదు.. ఏది తెచ్చినా ప్రజలకు ఉపయోగపడేది, పారదర్శకంగా జరిగేది ఇస్తానని చెప్పిన జగన్ మాటలు నమ్మరు తప్పా విశాఖ లో ఎడారి తెస్తా, అమరావతిని స్వర్గం చేస్తా అని చెప్పే చంద్రబాబు మాటలు అయితే నమ్మలేదు.. రాష్ట్రం విడిపోయాక ఇప్పటికే ఒకసారి నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు తెలివిగా బాబు తప్పించి జగన్ ను ముఖ్యమంత్రి చేశారు…

ఇక చంద్రబాబు జగన్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యం లో ఒక పేజీ కూడా సరిగా లేని వైసీపీ మేనిఫెస్టో కి, వందల కొద్దీ పేజీలు ఉన్న టీడీపీ మేనిఫెస్ట్ కి ఏంటి తేడా అని కనుక్కునే పనిలో పడ్డాడట.. నవరత్నాలు కాన్సెప్ట్ తో జగన్ సీఎం అయితే ఇక్కడ 100 హామీలిచ్చిన ప్రజలు నమ్మలేదంటే ఎక్కడ దెబ్బ కొట్టింది అని చంద్రబాబు ఆలోచిస్తున్నారట..  అయితే ఇప్పుడు అయన టార్గెట్ 2024 లో జరిగే ఎన్నికల మీదే ఉందట.. అప్పటివరకు ఎలాగోలా నెట్టుకొచ్చి అప్పుడు ప్రజలను తనవైపు తిప్పుకునేలా చంద్రబాబు మేనిఫెస్టో రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడట..

అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా అప్పుడే వచ్చే ఎన్నికల గురించి మాట్లాడడం కొంత విడ్డూరమే అయినా వైసీపీ నేతలు చంద్రబాబు చేస్తున్న ప్రగల్భాలకు ఏవిధంగానూ తలొంచట్లేదట… వాటిని తిప్పికొడుతూ జనాల్లో నవ్వుల పాలయ్యే విధంగా చేస్తుంన్నారట.. ఓ వైపు చంద్రబాబుకు జనం అధికారం ఇవ్వరని కొడాలి నాని బాబు రాజకీయ‌‌ భవిష్యత్తు మీద నాలుగేళ్ళ ముందే జోస్యం చెప్పేశారు. మరి చంద్రబాబు 2024 ఎన్నికల కొరకు  ఎలాంటి మేనిఫెస్టో లను తయారు చేసి ప్రజలను తనవైపు తిప్పుకుంటారో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -