- Advertisement -
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశం అంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ దాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈదాడి ఘటనను దేశం ముక్తఖంఠంతో ఖండించింది. ప్రధాని నేరేంద్రమోదీ, ఇతర పార్టీల నేతలు స్పందించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విట్టర్లో స్పందించారు. పుల్వామా ఘటన గురించి విని తాను షాక్ తిన్నానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అమరులైన జవాన్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయాలపాలైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు.