Friday, April 26, 2024
- Advertisement -

చాలా మందిని చుశా.. వేషాలు వేయకు అని ధోనీ కోపడ్డాడు : షమీ

- Advertisement -

ఓ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనపై కోపడ్డాడని భారత పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. తన ముందు వేషాలు వేయద్దని.. ఎంతో మంది ఆటగాళ్లను చుశానని మందలించాడని షమీ గుర్తుచేసుకున్నాడు. మనోజ్ తివారీతో శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌‌లో మాట్లాడిన షమీ.. తనపై ధోనీ ఆగ్రహం అయిన విషయంను గుర్తు చేసుకున్నాడు.

అప్పటికే భారత బౌలర్లు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ లో మరో బ్యాట్స్‌మన్ క్యాచ్ ను భారత ఫీల్డర్లు వదిలేశారని తెలిపాడు. దాంతో తీవ్ర అసహనానికి లోనైన తాను.. తర్వాతి బంతి బౌన్సర్ వేశానన్నాడు. ఆ బంతి ధోనికి అందకుండా నేరుగా బౌండరీకి వెళ్లిందని.. దాంతో దోనీ తనపై కోపడ్డాడని గుర్తు చేసుకున్నాడు. అనంతరం లంచ్ బ్రేక్‌తో డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తుండగా.. ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చి చివరి బంతిని అలా ఎందుకు వేసావ్? అని అడిగాడు.

అందుకు జవాబు నేను చెప్పలేకపోయాను. దాంతో ఆగ్రహానికి గురైన మహీ భాయ్ తన ముందు వేశాలు వేయవద్దని మందలించాడు. చాలా సీరియస్‌గా.. చూడు బ్రదర్, నేను వస్తూ.. పోతున్న ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. నా ముందు అబద్దాలాడకు. నేను నీ సీనియర్‌తో పాటు కెప్టెన్‌ని. నన్ను ఫూల్ చేయకని నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అని షమీ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -