- Advertisement -
ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికి ఐదు మ్యాచ్లు ఆడిన భారత్ నాలుగింట్లో గెలవగా వర్షం కారనంగా న్యూజిలాండ్తో మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. పాయంట్ల పట్టికలో 9 పాయంట్లతో మూడోప్లేస్లో ఉంది. తన తదుపరి మ్యాచ్ 27న విండీస్తో మాంచెస్టర్లో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం నెట్స్లో కష్టపడుతూనే జిమ్లో కూడా విరాట్ కోహ్లీ కఠిన కసరత్తులు చేస్తున్నాడు.
భారత్ జట్టులోకి ఎంపికవ్వాలంటే యో-యో ఫిట్నెస్ టెస్ట్లో పాసవ్వాలనే నిబంధనని రెండేళ్ల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా అమలు చేస్తోంది. దీంతో.. ఆటగాళ్లలోనూ ఫిట్నెస్పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి.. జిమ్లో తాను కఠినంగా శ్రమిస్తూ.. టీమ్కి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.