ఎట్టకేలకు స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదల అయింది. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు తీసుకోబోతున్నారట. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్లో ఉంచి.. ఆ తరువాత వారితో షో కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాలు వైద్యులు పర్యవేక్షలో ఉంచి ఆ తర్వాత కరోనా నేపథ్యంలో హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుంటే అప్పుడు వారిని కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో మొదలైంది. హౌస్ లోకి వెళ్లే ఓ 15 మంది సెలబ్రిటీ వీరే అని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హాట్ భామల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వా, ఐటమ్ భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మిగితవారు వీరేనట..
- పూనమ్ భజ్వా
- శ్రద్దాదాస్
- హంసా నందిని
- సింగర్ సునీత
- మంగ్లీ (సింగర్)
- హీరో నందు (గీతా మాధురి భర్త)
- వైవా హర్ష
- అఖిల్ సార్దక్
- యామినీ భాస్కర్
- మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)
- అపూర్వ
- పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)
- మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)
- ప్రియ వడ్లమాని
- సింగర్ నోయల్
ఈ పదిహేను మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో చూడాలి.
నన్ను ఆ కేసులో ఇరికించింది అతనే : సుమన్
రష్మి హగ్ నన్ను హగ్ చేసుకుంది.. అడ్డంగా బుక్ చేసిన సుధీర్..!