Tuesday, April 30, 2024
- Advertisement -

లూసిఫర్ రీమేక్ విషయంలో వినాయక్ కి చిరు పెద్ద షాక్..?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.. గత కొన్ని రోజులుగా చిరంజీవి తర్వాతి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ని లూసిఫర్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ సినిమా కాదని అంటున్నారు.. ఈ సినిమా తర్వాత మెహర్ దర్శకత్వంలోనే చిరు సినిమా చేయబోతున్నారట..

ఇక మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. గతంలో పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కన పెట్టిన ఘనత చిరు ది. వివి వినాయక్ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నాడని అందరికి తెలిసిందే.. ఇది మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్.. మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు రాగ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిగా లేని వినాయక్ కు ఛాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి..

ఇక మోహన్ లాల్ నటించిన ఈ మలయాళ సినిమా కి మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, చాలా వరకు మార్చి వినాయక్ కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఈ మధ్యనే ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు.అందుకు చిరు కూడా ఓకే అనడంతో ఈ సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు మొదలవుతున్నాయి అని తెలుస్తుంది. తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సైరా వంటి హిట్ తో టాప్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తుండగా ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివ ఈ సినిమా కి దర్శకుడు.. సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తుంది..

రాజ్ తరుణ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -