భారత్లో ఏదో ఒక రోజు పాకిస్థాన్లోని కరాచీ అంతర్భాగం అవుతుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించారు. అఖండ భారత్ భావనను తాము విశ్వసిస్తామని స్పష్టం చేశారు.
ముంబయిలోని కరాచీ స్వీట్స్షాపు యజమానిని ‘కరాచీ’ పేరు తీసేయాల్సిందిగా శివసేన నేతలు ఆదేశిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫడణవీస్ ప్రకటనపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను ముందుగా స్వాధీనం చేసుకోవాలని సూచించిన ఆయన.. తర్వాత కరాచీ విషయం చూద్దామంటూ.. ఫడణవీస్కు, బిజేపి కి చురకలు అంటించారు.
నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?
టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?
చంద్రబాబు ఆర్భాటాలు దేనికి పనికొస్తాయి..?
టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?