Saturday, May 18, 2024
- Advertisement -

జోరు పెంచిన హాట్ యాంకర్.. ఏకంగా రెండు ఐటమ్ సాంగ్స్!

- Advertisement -

ఏడేళ్ల క్రితం జబర్ధస్త్ కామెడీ షో లో తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకర్షించింది యాంకర్ అనసూయ. ఆరు నెలల్లోనే ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ రావడంతో ఇతర ఛానల్స్, సినిమాల్లో అవకాశం వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ నటనకు మంచి పేరు వచ్చింది. ఓ వైపు ఛానల్స్ లో బిజీగా ఉంటూనే వెండితెరపై తన సత్తా చాటుతుంది.

ఇక నటిగానే కాదు.. ఐటమ్ సాంగ్స్ లో కూడా ఈ హాట్ బ్యూటీ జోరు పెంచింది. తాజా సమాచారం ప్రకారం అనసూయ రెండు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఒక పాత్రలో నటించడంతో పాటు ప్రత్యేక గీతంలో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేయనుందట.

అంతే కాదు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటిస్తుంది. ఈ సాంగ్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అంతే కాదు అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్యాంక్యూ బ్రదర్ విడుదలకి సిద్ధం అవుతుంది.

అది మ‌రి బ‌న్నీ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే!

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -