“పక్కా కమర్షియల్” టైటిల్ తో వస్తున్న చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. ముందు ఈ సినిమాకు మాస్ మహారాజ్ రవితేజను హీరోగా తీసుకోవాలని డైరెక్టర్ భావించాడట. ఆ తర్వాత మూవీ యూనిట్ గోపిచంద్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు మొదలయ్యాయి.
దీనికి కారణం మరుతి డైరెక్షన్ ఒకటైతే.. ఈ సినిమాలో గోపిచంద్ హీరో అవ్వడం మరోటి. అలాగే ఈ సినిమాకు మరో ప్రత్యేకత తోడైంది. ఈ సినిమాలో గోపిచంద్కు జోడీగా రాశిఖన్నాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దూ ఇప్పటికే జిల్, ఆక్సిజన్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి మనందరికి తెలిసిందే.
ఇదే నిజమైతే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జోడి సినీ ప్రేక్షకులకు వినోదం పంచనున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే లో రాశిఖన్నానటించి మెప్పించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే గోపీచంద్ సీటిమార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్.
చైనాలో పిల్లలు పుట్టట్లే.. ! ఆందోళనలో ఆ దేశం.. అందుకేనా?
చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే !