సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్పపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు రంగస్థలం లాంటి సినిమాను తీసిన సుకుమార్ డైరెక్షన్.. మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరో కావడం. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చాయి. ఇవి సినీ ఇండస్ట్రీలో మంచి వసుళ్లను రాబట్టాయి.
ఇక రాబోతున్న ఈ మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ మాత్రం మాములుగా లేదు. మాస్ లుక్ లో అదరకొడుతోంది. ఇక ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్కు ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్కు రెడీ అవుతోందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా భారీ హిట్ ను కొట్టనుందని పలువురు అంటున్నారు.
పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 13వ తేదీన విడుదలకానుందని సినీ యూనిట్ పేర్కొంటుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేందుకు సినిమాలో సునీల్తో పాటు అల్లు అర్జున్కు సరిజోడిగా ఒక స్టార్ హీరోను విలన్గా చూపించబోతున్నారని టాక్. అలాగే సాయి పల్లవి కూడా ఒక క్రేజీ రోల్లో కనిపించనుందని సమాచారం.
విభిన్న కథాంశంతో రాబోతున్న శ్రియ!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !