మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే… అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకమట. ఈ పాత్ర కోసం మొదట విజయ్ శాంతిని సంప్రదించగా ఆమె నో చెప్పిందట.. ఇక నయనతారా ని కూడా అడగగా ఆమె కూడా చెయ్యనని చెప్పిసిందట… ఇక ఆ పాత్ర కోసం త్రిషని సంప్రదించారట…ఆ రోల్ చేసేందుకు త్రిష అంగీకరించినట్టు సమాచారం అందింది. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు.
గతంలో చిరంజీవి, త్రిష స్టాలిన్
సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య
లో హీరోయిన్గా ముందుగా త్రిషనే ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది.
లూసిఫర్
రీమేక్లో మాత్రం నటించడానికి త్రిష అంగీకరించిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య
సినిమా మే 13న విడుదల కాబోతోంది.
జినోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్.. కేటీఆర్ హామీ..!