Thursday, March 28, 2024
- Advertisement -

వరవరరావుకు కండీషన్ పై బెయిల్ మంజూరు!

- Advertisement -

వరవర రావు (81) కు బెయిల్ మంజూరు అయింది. కోరెగావ్-భీమా కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు ఈ రోజు బాంబే హైకోర్టు ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్నందున షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, వరవరరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం సుముఖత తెలిపింది.

తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

ప్రస్తుతం ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నానావతి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూండటం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు దేశంలో ఏందరో మేధావులు ఆందోళనవ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -