Thursday, April 25, 2024
- Advertisement -

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాంచి ఫాంలో దూసుకెళుతున్నాడు. కథ నచ్చితే చాలు వరుసగా డైరెక్టర్లను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో హిట్ డైరెక్టర్ పరశవురాం డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే ప్రిన్స్.. జక్కన్న, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సూపర్ స్టార్.. దర్శకుడు సందీప్ వెడ్డి వంగాతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇక ఈ డైరెక్టర్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

హిందీలో రీమేక్ చేసి ఈ డైరెక్టర్ హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. ఇక తాజాగా వస్తున్న గాసిప్స్ కు తెరదించి.. అసలు విషయం బయటపడింది. తాజాగా మషేష్ బాబు హ్యావెల్స్ కంపెనీకి యాడ్ చేయబోతున్నాడట. దీనికోసమే ప్రిన్స్ తో జతకట్టనున్నాడట డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఈ యాడ్ లో మహేశ్ తో పాటుగా తమన్నా కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తుందట. అతి తొందరలోనే ఈ ప్రకటన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

మీరు పొగతాగుతారా..? అయితే మీ పిల్లలు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయి

దేశంలో తొలి లీగల్ సెక్స్ స్టోర్ ఎక్క‌డుందో తెలుసా?

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

మ‌రో బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా

క‌మ‌ల్ హాసన్ కారుపై ‘దాడి’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -