టాలీవుడ్, బాలీవుడ్ నటులు వరుసగా కరోనా భారిన పడుతున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సెలబ్రెటీలు వరుసగా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా పూజ హెగ్డేకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆమె చెప్పింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ హూం ఐసోలేషన్ లో ఉంది. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కరోనా విజృంభిస్తోన్న వేళ అందరూ ఇళ్లలోనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని ఆమె కోరింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా లక్షణాలు ఏమాత్రం ఉన్నా వెంటనే పరీక్షించుకోవాలని అన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానుల ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ చెబుతున్నానని పేర్కొంది.
యాంకర్ సుమపై ఫైర్.. నీకు క్రూరత్వం కనిపించడం లేదా అంటూ?