మన సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర కథానాయకుడు అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘వలిమై’. సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ
సినిమాకు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.హిరో అజిత్ ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్ అజిత్ హీరోగా ఇప్పటికే తమిళంలో “నేర్కొండ పార్వైగా” మూవీనీ రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో మళ్లీ అజిత్ హీరోగా ‘వలిమై’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా మే 1న అజిత్ బర్త్ డే సందర్భంగా “వలిమై” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అజితా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో “వలిమై”మూవీకి సంబంధించిన అప్డేట్ నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాత బోనీకపూర్ ప్రకటించడంతో హీరో అజిత్ అభిమానుల్లో గందరగోళం నెలకొని నిర్మాత బోనీకపూర్ పై ఫైర్ అవుతున్నారు.