Wednesday, May 22, 2024
- Advertisement -

కరోనాతో సినీ దర్శకుడు శ్రవణ్ కన్నుమూత!

- Advertisement -

దేశంలో కరోనా ఏ ముహూర్తంలో మొదలైందో కానీ సెలబ్రెటీల పాలిట శాపంగా మారింది. గత ఏడాది నుంచి ఎంతో మంది సినీ కళాకారులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా కరోనా భారిన పడి మరో దర్శకుడు కన్నుమూశారు. ఇప్పటికే యువ దర్శకుడు కుమార్ వట్టి మరణం జీర్ణించుకోక ముందే తాజాగా తెలుగు సినీ దర్శకుడు కరోనాకు బలయ్యారు. డైరెక్టర్ శ్రవణ్ గుండెపోటుతో కన్నుమూశారు.

Read Also : కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సీఎం కేజ్రీవాల్ సతీమణి

వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రవణ్ ‘ప్రియుడు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మద్యనే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా, తనలో కరోనా లక్షణాలు కనిపించినా అవి పోస్ట్ వ్యాక్సిన్ ప్రభావంతో వచ్చాయని ఆయన భావించారు.

Read Also : ఆ రెండు తర్వాత హ్యాంగ్ అయ్యేది అక్కడే.. అల్లు శిరీష్!

ఈ నేపథ్యంలోనే తనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో, టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటికే అది ముదిరి పోవడంతో సరైన చికిత్స అందక నిన్న గుండెపోటుకు గురయ్యారు. రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రవణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -