Tuesday, April 30, 2024
- Advertisement -

కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సీఎం కేజ్రీవాల్ సతీమణి

- Advertisement -

దేశంలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ కరోనాకు అడ్డగా మారింది. దాంతో ఇక్కడ లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఈ మద్యనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారుమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. సునీత కేజ్రీవాల్ చాలా ధైర్యవంతురాలని, కరోనా ఆమెను ఏమీ చేయలేదని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. భార్య సునీతకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా హోం ఐసోలేషన్‌లో ఉండి త్వ‌ర‌గానే కోలుకున్నారు.

దేశ రాజధాని ఢిల్లీని కరోనా పట్టిపీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా కేసులు, మరణాలు తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 395 మంది మరణించారు.

లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

గుజరాత్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 18 మంది రోగుల సజీవ దహనం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -