సీక్వెల్ సినిమాలు తెరకెక్కించడం ఇప్పుడు సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కించేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. బాహుబలి తో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా కేటగిరిలో ప్రతిష్ఠాత్మకంగా తీసే సినిమాలకు సీక్వెల్ రూపొందుతుండటం గమనార్హం.
దక్షిణాదిన సంచలనాలు నమోదు చేసిన కేజీఎఫ్ కొనసాగింపుగా.. కేజీఎఫ్ -2 పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రతిచోట దీనికి భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
Also Read: పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..
ఇక పుష్పను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పుష్ప -1 ఆల్రెడీ చిత్రీకరణ పూర్తిచేసుకున్నది. ఇక పుష్ప-2 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. మరోవైపు బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్నది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు టాక్.
ఇక లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల మందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇందులో ప్రముఖ భారతీయ నటీనటులందరూ చేస్తుండటం గమనార్హం. మొత్తంగా సీక్వెల్స్ తెరకెక్కించడం ఓ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. గతంలో ఓ సినిమా హిట్ అయ్యాక దానికి సీక్వెల్ రూపొందించేవారు. ఇప్పుడు మొదటి సినిమా షూటింగ్ టైంలోనే సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారు.
Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!