Friday, April 26, 2024
- Advertisement -

సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

- Advertisement -

సీక్వెల్​ సినిమాలు తెరకెక్కించడం ఇప్పుడు సక్సెస్​ ఫార్ములాగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు సీక్వెల్​ తెరకెక్కించేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. బాహుబలి తో ఈ ట్రెండ్ స్టార్ట్​ అయ్యింది. ఇప్పుడు పాన్​ ఇండియా కేటగిరిలో ప్రతిష్ఠాత్మకంగా తీసే సినిమాలకు సీక్వెల్ రూపొందుతుండటం గమనార్హం.

దక్షిణాదిన సంచలనాలు నమోదు చేసిన కేజీఎఫ్​ కొనసాగింపుగా.. కేజీఎఫ్​ -2 పాన్​ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రతిచోట దీనికి భారీ హైప్​ క్రియేట్​ అయ్యింది.

Also Read: పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

ఇక పుష్పను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పుష్ప -1 ఆల్​రెడీ చిత్రీకరణ పూర్తిచేసుకున్నది. ఇక పుష్ప-2 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్​ కూడా పూర్తయినట్టు సమాచారం. మరోవైపు బాలీవుడ్​లో బ్రహ్మాస్త్ర అనే భారీ బడ్జెట్​ మూవీ తెరకెక్కుతున్నది. రణబీర్ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు టాక్​.

ఇక లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల మందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇందులో ప్రముఖ భారతీయ నటీనటులందరూ చేస్తుండటం గమనార్హం. మొత్తంగా సీక్వెల్స్​ తెరకెక్కించడం ఓ సక్సెస్​ ఫార్ములాగా మారిపోయింది. గతంలో ఓ సినిమా హిట్​ అయ్యాక దానికి సీక్వెల్​ రూపొందించేవారు. ఇప్పుడు మొదటి సినిమా షూటింగ్​ టైంలోనే సీక్వెల్​ను ప్లాన్​ చేస్తున్నారు.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -