మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో శ్రావణి అనే అమ్మాయి ‘రేలా రే రేలా రే నీళ్లల్లో నిప్పలే వచ్చింది నిజమల్లే.. పడిలేచి నిలిచే రణములో నా తెలంగాణ’ అనే పాటను ఎంతో అద్భుతంగా పాడింది. ఈ వీడియోను సరేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఆ యువతి గానం ఎంతో అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్.. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, దేవీ శ్రీప్రసాద్కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. నిజంగా ఆమె ట్యాలెంట్ అద్భుతమంటూ దేవిశ్రీ ట్వీట్ చేశారు.
ఇంత మంచి ప్రతిభ ఉన్న అమ్మాయిని తమకు పరిచయం చేసినందుకు థాంక్యూ అంటూ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాలెంట్ ఉన్నవారి కోసం వెతుకుతున్నానని ఆమె వివరాలు కనుక్కుంటాను అని దేవిశ్రీప్రసాద్ హామీ ఇచ్చాడు. అలాగే తన కొత్త షో ద్వారా ఆమెకు అవకాశం కూడా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం దేవీ శ్రీ ‘పుష్ప’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు పవన్ హరీష్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.