వనితా విజయ్ కుమార్ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. తరచూ ఏదో ఒక అంశంలో ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బిగ్బాస్ తో ఫేమస్ అయిన వనిత.. ఆ తర్వాత ఎన్నో వివాదాస్పద ప్రకటనలు చేసింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం సైతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె మూడు పెళ్లిల్లు చేసుకొని విడాకులు ఇచ్చింది. తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకున్నదంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సీనియర్ నటుడు విజయ్ కుమార్ , నటి మంజుల దంపతుల పెద్ద కూతురే వనిత అన్న విషయం తెలిసిందే. ‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్బాస్ షోలో హల్చల్ చేసింది. ఇటీవల ఓ టీవీ షో విషయంలోనూ సీనియర్ నటి రమ్యకృష్ణతో గొడవ పడి బయటకు వచ్చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా వనిత పెళ్లి ఫొటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. పవర్ స్టార్ శ్రీనివాసన్తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కొందరు కామెంట్లు పెట్టారు.
మరి కొందరు ఈ మొగుడితోనైనా కొంతకాలం ఉంటావా? లేక ఇతడిని కూడా వదిలేస్తావా? అంటూ కామెంట్లు పెట్టారు. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే.. నిజానికి వనిత కొత్తగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా జరిగిన వివాహం అది. అయితే సినిమా ప్రమోషన్ కోసమే.. ఆ చిత్ర యూనిట్ ఇటువంటి ట్రిక్ ప్లే చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
కుమ్రంభీంకు ముస్లిం టోపీ.. రచయిత విజయేంద్ర ప్రసాద్ రియాక్షన్ ఇదే..!