టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల్లో కొనసాగింపుపై సంచలన ప్రకటన చేశారు. తన భర్త గౌతమ్ కిచ్లు కోరితే సినిమాల నుంచి వైదొలుగుతానని వ్యాఖ్యలు చేశారు. కాజల్ ప్రకటనపై ఆమె అభిమానులు షాకయ్యారు. ముంబైకి చెందిన కాజల్ 2004లో బాలీవుడ్ లో ఓ సినిమా ద్వారా సినీ రంగంలో ఆరంగేట్రం చేశారు. 2007లో తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు.
అదే ఏడాది వచ్చిన చందమామ సినిమా సూపర్ హిట్ కావడంతో కాజల్ అగర్వాల్ కు తెలుగులో స్టార్డం వచ్చింది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ టాప్ హీరో స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి తెలుగులో అందరు అగ్రహీరోలతో వరుసగా నటించింది.
డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్,నాయక్, బిజినెస్ మెన్, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, ఖైదీ నెంబర్ 150 వంటి హిట్ సినిమాల్లో నటించింది. చాలా ఏళ్ల పాటు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు తో పాటు తమిళంలో ఆమె అక్కడి అగ్రనాయకులు కమలహాసన్, విజయ్, ధనుష్, సూర్య, అజిత్, విశాల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే కాజల్ 17 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 36 ఏళ్ల వయసులోనూ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది.
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానం ఇస్తూ ‘ నేను ఎంత కాలం సినిమా రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు. నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరుక్షణమే సినిమాలకు గుడ్ బై చెబుతాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను’ అని కాజల్ తెలిపింది. కాజల్ చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
Also Read
కాస్కోండి.. మొదలైంది సినిమాల జాతర..!