- Advertisement -
పవన్ కల్యాణ్ హీరోగా, రానా విలన్ పాత్రలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ సినిమా అయప్పన్ కోషియమ్కి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
గత 10 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.74.11 కోట్ల షేర్, రూ.113 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 94.66 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా ఇప్పటికే భీమ్లా నాయక్ రూ.150 కోట్ల క్లబ్లో చేరింది.
భీమ్లా నాయక్ కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు, తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్ కావడంతో ఇటీవల పవన్ కల్యాణ్ చిత్ర యూనిట్కు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో జక్కన్న టీం