- Advertisement -
మనం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్.. అక్కినేని నాగచైతన్య హీరోగా థాంక్యూ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
జూలై 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో హాకీ ప్లేయర్గా కనిపించబోతున్న నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తమన్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. మనం కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?