Thursday, May 23, 2024
- Advertisement -

జగన్ కు పవన్ వార్నింగ్ లు..ఫైర్ వెనుక అసలు కథ!

- Advertisement -

గత కొన్ని రోజులుగా జనసేన, వైసీపీ మద్య రాజుకున్న రాజకీయ వేడి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. విశాఖ ఘటనతో ఇరు పార్టీల మద్య మొదలైన రాజకీయ వివాదం నేటివరకు కూడా అంతే స్థాయిలో కొనసాగుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక వైసీపీ నేతలతో తాడో పేడో తేల్చుకునేదే అంటూ జనసేన అధినేత ఇప్పటికే వార్ డిక్లేర్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు, భూతు పదజాలలతో విరుచుకుపడుతూ.. జనసైనికులలో ఆవేశాన్ని నింపుతున్నారు. ఇక తాజాగా ఇప్పటం గ్రామంలో జరిగిన పరిణామాలు మరోసారి జనసేన వర్సస్ ఏపీ ప్రభుత్వం మద్య అగ్గి రాజేశాయి.

రోడ్ల నిర్మాణం కొరకు ప్రజల ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతుడడంతో అక్కడికి పవన్ రాకతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో మరోసారి జనసేనాని ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జనసేన సభకు స్థలమిచ్చినందుకే ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతోందని.. గుంతలు పూడ్చలేని ప్రభుతానికి.. రోడ్ల విస్తరణ కావాలా అంటూ ఫైర్ అయ్యారు. త్వరలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా అదే విధంగా కూల్చుతారని హెచ్చరించారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండీ అంటూ మండి పడ్డారు. దెబ్బ పడితే రక్తాలు కారాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యటనను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో విరమించేది లేదని తేల్చి చెప్పారు.

దీంతో అక్కడ ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది. అయితే పవన్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉండడంతో.. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల్లో ఉన్నత స్థానం ఉన్న వ్యక్తి ” రక్తాలు కారాలి.. ” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని.. ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ పై హత్యప్రయత్నం చేసేందుకు రిక్కి జరుగుతుందని తాజాగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో పవన్ ఈ రకంగా ఫైర్ అవుతున్నారని, కొందరు పవన్ వైఖరిపై సానుకూలంగా స్పందిస్తున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా జనసేన వర్సస్ వైసీపీ రాజకీయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -