భాజాపా జాతీయ అధ్యక్షుడు అమీత్సాపై తెలంగాణా సీఎం కేసీఆర్ విరుచుకు పడ్డారు.లైవ్లో కమళం ఛీప్ను దమ్ము దులిపారు. ఎవరి ప్రయేజనాలకోసమో ఎవరి ప్రయోజనాలకోసం అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణా ప్రజల్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.
నల్లగొండ పర్యటనలో రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు.
{loadmodule mod_custom,Side Ad 1}
అమిత్ షా చెప్పిన లెక్కలు అన్ని అద్భుతమైనవన్నారు. న్యాయవ్యవస్థ విభజన జరగనంత వరకూ రాష్ట్ర విభజన జరిగిందని అనుకోలేమన్నారు. తెలంగాణ ప్రజలను షా తక్కువగా చూడడాన్ని సీఎం తప్పుపట్టారు. అసత్య, అబద్ధ ఆరోపణలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా షా మాట్లాడారన్నారు.
మూడు రోజుల పాటు నల్గొండ జిల్లా పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనేక అవాస్తవాలను ప్రచారం చేశాడని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయమై తాను మౌనంగా ఉంటే అమిత్ షా చెప్పిన మాటలన్నీ వాస్తవాలు అని నమ్మేపరిస్థితి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పారు. కేంద్రం దయదక్షిణ్యాలమీద బతకడం లేదన్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
అమిత్ షాకు ఎటుపడితే అటు మాట్లాడే అలవాటు ఉందని, దాని వల్ల తెలంగాణ ప్రగతికి ఆటంకం కలిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ పార్టీని తెలంగాణ ప్రభుత్వం ఎన్నటికీ క్షమించదన్నారు. జాతీయ విపణిలో చాలా బాధ్యతారహితంగా బీజేపీ నేత మాట్లాడారు కాబట్టి, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.అమిత్ షా కాదు… ఏషా కాదు తెలంగాణే తనకు బాద్షా అన్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read