హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా మూవీగా వస్తున్న సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను డిసెంబర్ 1 నుండి మొదలు పెట్టనున్నారు.
ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ఆ సినిమా హీరో యష్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమా కేజీఎఫ్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నానని చెప్పారు.వాస్తవానికి కేజీఎఫ్ స్టోరిని తనకు చెప్పిన దానికంటే చాలా బాగా నీల్ తెరకెక్కించారని…సలార్ విషయంలోనూ అదే జరుగుతుందన్నారు.
దీంతో యష్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్లో జోష్ నింపగా సలార్పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక క్రిస్మస్ కానుగా వస్తున్న ఈ సినిమాపై యష్ అంచనాలను పెంచేయగా షారుఖ్ డంకీతో తలపడనున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద జరుగుతున్న ఈ వార్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి..