రిపబ్లిక్ డే రోజున టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదని ఆరోపిస్తూ రాజోలు, రాజా నగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేనలో సంబరాలు మొదలయ్యాయి.
జనసేన అభ్యర్థిగా బత్తుల బాలరామకృష్ణ పేరును ప్రకటించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పవన్ ప్రకటనతో రాజానగరం టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు. టీడీపీ అధిష్టానం నుండి తమకు ఎలాంటి సమాచారం లేదని, పార్టీ ఆఫీస్ నుండి వెళ్లిపోయారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి.
వాస్తవానికి టీడీపీ – జనసేన మధ్య రాజానగరం సీటు విషయంలో కొంతకాలంగా ఫైట్ నడుస్తోంది. అయితే జనసేన నుండి టికెట్ ఆశీంచిన బత్తుల బాలరామకృష్ణ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అంతేగాదు నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు.